
పద్మారావునగర్, వెలుగు: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీ హాస్పిటల్ మెయిన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం జూనియర్డాక్టర్లు నిరసన తెలిపారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా స్టైఫండ్, సూపర్ స్పెషాలిటీ సీనియర్రెసిడెంట్లకు సరైన గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. సీట్ల కేటాయింపులో ఏపీ స్టూడెంట్లకు ఉన్న15 శాతం రిజర్వేషన్ను తొలగించాలని డిమాండ్చేశారు. మెడికల్ కాలేజీలు, హాస్టళ్లలోని సౌకర్యాలను మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు.